అయ్యా వార్లు ఇది తగునా

అస్సలే ఇప్పుడు పరీక్షల కాలం ఇంకా మన పాఠశాలలో ప్రబుద్ధులు సిలబస్ సగం కూడా పూర్తి కానివ్వలేదు మరి ఇలాంటప్పుడు మీరు ప్రభుత్వంతో పోరాడడం సమంజసమేనా. మీ సమస్యలు ఏవైనా వుంటే మీ నాయకుల ద్వారా పరిష్కరించుకోవచ్చుగాని, ఇదే అదునుగా సెలవులు దొరికాయని భావించి మీ సొంత వూళ్ళకు చెక్కేయడం ఏమైనా సమంజసమా, ఎలాగూ మీ పిల్లలను కార్పోరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారు కదా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన విధంగానే మరి మా పిల్లల భవిష్యత్తు గురించి కూడా కాస్త ఆలోచిస్తే బాగుండు సారు.